News October 21, 2024
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మంత్రి జూపల్లి

బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అవాస్తలు, ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసం గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నగరంలోని సోమవారం నుడా ఛైర్మన్గా కేశ వేణు బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
Similar News
News October 26, 2025
నిజామాబాద్: ముంపు రైతులకు రూ.50 వేలు చెల్లించాలి: కవిత

ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతం యంచలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతం నవీపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. ఇది దేవుడు చేసింది కాదన్నారు.
News October 26, 2025
NZB: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి’

ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా NZB కలెక్టర్, ఇతర అధికారులతో ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.
News October 25, 2025
నిజామాబాద్: మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: కలెక్టర్

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగంపై వివరించారు.


