News February 19, 2026
బీఈడీ కళాశాలల యాజమాన్యాలపై VCకి ఫిర్యాదు

YVU పరిధిలోని కొన్ని బీఈడీ కళాశాలలు తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించాయని, ఇది సమంజసం కాదని ఆల్ ఇండియా బంజారా విద్యార్థి సంస్థ జిల్లా అధ్యక్షుడు రమావత్ జగన్నాయక్ అన్నారు. గురువారం YVUలోని పరిపాలన భవనంలో VC రాజశేఖర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బీఈడీ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నాయని ఆరోపించారు. తక్షణమే ఆయా కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


