News January 10, 2025
బీఈడీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వివరాలను యూనిర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు ఇన్ఛార్జ్ వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. 2,647 మంది విద్యార్థులు రెగ్యులర్ కింద పరీక్షలు రాయగా.. వారిలో 2,499 మంది పాసయ్యారు. సప్లిమెంటరీ కింద 370 మంది పరీక్షలు రాయగా.. 342 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన వెల్లడించారు.
Similar News
News January 18, 2025
పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News January 18, 2025
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.
News January 18, 2025
మంత్రి ఫరూక్పై సీఎం అసంతృప్తి!
మంత్రులు, ఎంపీలతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలోనూ మార్కులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంలో మంత్రి ఫరూక్ వెనుకబడ్డారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా పీఆర్వో, ఉద్యోగులను ఇచ్చినా చివరిస్థానంలో నిలవడం సరికాదరి, ఈసారి ర్యాంకు మెరుగవ్వాలని సూచించారు.