News March 24, 2025

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

image

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Similar News

News April 25, 2025

NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.

News April 24, 2025

NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

image

రేషన్‌ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్‌ ఇంటర్‌​నెట్​లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

News April 24, 2025

16 పాఠశాలల్లో అందరూ పాస్: అరుణమ్మ

image

నెల్లూరులోని 16 జడ్పీ పాఠశాలల్లో అందరూ పాసయ్యారని జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 10,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 7,414 మంది పాసయ్యారని చెప్పారు. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆమె అభినందనలు తెలిపారు.

error: Content is protected !!