News June 7, 2024
బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్.. ఆధిక్యంలో మల్లన్న
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.
Similar News
News September 30, 2024
NLG: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు
NLG- KMM- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.
News September 30, 2024
యాదాద్రి కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 12 తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
News September 30, 2024
సమగ్ర కుల జనగణన చేయాలి: తీన్మార్ మల్లన్న
సమగ్ర కుల జనగణన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం సమగ్రకుల జన గణన సాధనకై బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ఉద్యోగులు, మేధావులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకపోతే, 42 శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత అని అన్నారు.