News February 23, 2025

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

image

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News October 24, 2025

భూ-సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: MP కావ్య

image

గ్రీన్‌ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ పర్యాటక రంగ విస్తరణ కోసం పలు ఆలయాలను ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యాటక శాఖతో చర్చలు జరుపుతున్నామని, ఓరుగల్లు అభివృద్ధి విషయంలో వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తన గళాన్ని వినిపిస్తానని ఎంపీ తెలిపారు.

News October 24, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> రఘునాథపల్లిలో దొంగల బీభత్సం
> జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఝాన్సీ రెడ్డి
> పెంబర్తి గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం
> జనగామ: నూతన బ్యాంకు సేవలను ప్రారంభించిన కలెక్టర్
> కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
> సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
> నిడికొండ: అదుపు తప్పిన ట్రాలీ, తప్పిన పెను ప్రమాదం

News October 24, 2025

మ్యాచ్ రద్దు.. WCలో పాక్‌కు ఘోర అవమానం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్‌ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.