News February 16, 2025

బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పని చేయాలి: మంత్రి

image

బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నంద్యాలలో శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అభిరుచి మధు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

image

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 7, 2025

టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<>NGRI<<>>) 13 సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఎక్స్‌సర్వీస్‌మన్ JCO, ఎంటీఎస్ పోస్టులకు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ట్రేడ్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. వెబ్‌సైట్: https://www.ngri.res.in/

News December 7, 2025

మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

image

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.