News April 5, 2025
బీజేపీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వేముల ప్రమాణస్వీకారం

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్రావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు జిల్లా అంతటా పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ ఆచారి, సుధాకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్సభ

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.
News December 1, 2025
డీఎస్సీ-2025 టీచర్ల వేతనాల పట్ల ఆందోళన

డీఎస్సీ-2025తో ఎంపికైన టీచర్లకు 2 నెలలు గడిచినా జీతాలు విడుదల కాకపోవడంపై ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ భాస్కర్ ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త టీచర్లు జీతం రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇతర శాఖల నుంచి ఎంపికైన వారికి లాస్ట్ పే సర్టిఫికెట్, సర్వీస్ రిజిస్టర్ ఇవ్వకపోవడం, డీడీఓ లాగిన్లో వివరాలు తొలగించకపోవడంతో విద్యాశాఖ జీతాల బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.
News December 1, 2025
11 పరీక్ష కేంద్రాల్లో.. 2,412 విద్యార్థులు: కలెక్టర్

జిల్లాలోని బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షా నిర్వహణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంలను నియమించామని తెలిపారు.


