News April 10, 2024

బీజేపీ ప్రచారానికి విదేశీ రాజకీయ పార్టీలు

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. తమ ప్రచారానికి 25 దేశాలకు చెందిన రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వాటిలో 13 దేశాల పార్టీలు ఆహ్వానాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల పార్టీల ప్రతినిధులు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఎన్నికలుండటంతో ఆ దేశపు పార్టీలను మాత్రం బీజేపీ ఆహ్వానించలేదని సమాచారం.

Similar News

News February 27, 2026

వారం వరకు EVM-VVPAT వెరిఫై: సీఈసీ

image

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారం రోజుల వరకు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే కౌంటింగ్ రోజూ కూడా వీవీప్యాట్ల లెక్కింపు తప్పనిసరన్నారు. చెన్నైలో మాట్లాడుతూ ఈవీఎంల కంటే ముందు 2 రౌండ్లలోనే పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కించాలని పేర్కొన్నారు.

News February 27, 2026

ALERT: ఎల్లుండి నుంచి కొత్త రూల్

image

ఇండియాలో మెసేజింగ్ యాప్‌లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధన మార్చి 1 నుంచి అమలుకానుంది. దీనివల్ల మీ ఫోన్‌లో ఫిజికల్‌గా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేస్తాయి. ఈ గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ అథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.

News February 27, 2026

కాసేపట్లో మాజీ మావోలతో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ కాసేపట్లో భేటీ కానున్నారు. వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతోపాటు డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్‌లోని సచివాలయానికి చేరుకున్నారు.