News February 19, 2025
బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా గోపీ

బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపోయిన గోపి నియామకమయ్యారు. గోపిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. పలువురు నాయకులు గోపీకి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 15, 2025
రౌడీషీటర్ నవీన్రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.
News October 15, 2025
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి SC గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ విక్రయం, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. QR కోడ్ ఉన్న గ్రీన్ క్రాకర్స్ను ఈనెల 18 నుంచి 21 వరకు కాల్చుకోవచ్చని తెలిపింది. దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరడంతో క్రాకర్స్ విక్రయంపై గతంలో SC నిషేధం విధించింది. పిల్లలు ఎంతో సంబరంగా చేసుకునే దీపావళికి టపాసులు కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై SC సానుకూలంగా స్పందించింది.
News October 15, 2025
రూ.1000 పెరిగిన వండర్ హాట్ మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి మంగళవారం రూ.14,550 ధర పలకగా.. బుధవారం రూ.14,850కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.16,150 ధర పలకగా..ఈరోజు రూ.15,900 కి పడిపోయింది. వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.15,500 ధర వస్తే.. నేడు రూ. 1000 పెరిగి రూ.16,500కు చేరుకుంది.