News March 3, 2025

బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

image

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Similar News

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

image

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం నిరూపిస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.

News November 8, 2025

ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: సీఎం చంద్రబాబు

image

AP: కుప్పంలో రూ.2,203కోట్ల పెట్టుబడితో 7 సంస్థల ఏర్పాటుకు CM చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కుప్పంను ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తాం. ప్రైవేట్, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తాం. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలున్నాయి’ అని తెలిపారు. కుప్పంలో ల్యాప్‌టాప్, మొబైల్ యాక్సెసరీస్ వంటి 7 సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాలు కేటాయించింది.