News March 3, 2025
బీటెక్ విద్యార్థి మృతి సూసైడ్

నల్లమడ మండలం వెళ్లమద్ది గ్రామానికి చెందిన ప్రేమసాయి(21) పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రేమసాయి చిత్తూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం సమయంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
Similar News
News March 4, 2025
MHBD జిల్లా కేంద్రంలో రేపు ఎంపీ బలరాం

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మంగళవారం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటారని ఆయన PRO ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మూడవ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి నేరుగా MPని సంప్రదించవచ్చని కార్యాలయ వర్గాలు ప్రకటించారు.
News March 4, 2025
నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News March 4, 2025
VKB: 40 శాతం వైకల్యం తప్పనిసరి: అసిస్టెంట్ ట్రైని కలెక్టర్

భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ALIMCO) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాల మొదటిరోజు ఎంపిక శిబిరం స్థానిక ధర్మ విద్యాలయం స్కూల్లో నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ శిబిరానికి అసిస్టెంట్ ట్రైని కలెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి ఉమా హారతి హాజరయ్యారు. ఆమె మాట్లడుతూ.. ఉపకరణాలు పొందేందుకు కనీసం 40 శాతం వైకల్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.