News March 29, 2025

బీడు భూముల్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్ చివరలో 2 లక్షల ఎకరాల్లో మూడు నెలలు సెనగ పంట సాగుకు మాత్రమే పరిమితమై మిగిలిన కాలాన్ని వృథాగా ఉంచుతున్న బీడు భూముల్లో ఉద్యాన పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ జీ.రాజకుమారి వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో నాణ్యమైన ఉల్లి, మిర్చి, పసుపు పెంపకం కోసం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

రాజన్న ఆలయంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో రాజన్న ఆలయాన్ని విస్తరించనున్న నేపథ్యంలో ఆలయంలో ఇప్పటికే ఉన్న పలు కట్టడాలను తొలగిస్తున్నారు. దక్షిణం వైపుగల కోటిలింగాలను ముందుగా తరలించి, ప్రాకారాన్ని కూల్చివేస్తున్నారు. స్వామివారి అద్దాల మండపం తొలగింపు పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి.

News November 19, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్‌కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ గోల్డ్ గెలిచాడు