News April 11, 2025

బీబీనగర్‌లో రాకెట్ సామాగ్రి తయారీ

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్‌లో వినియోగించనున్న ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫొమ్ ప్యాడ్లతో పాటు ఇతర ముడి సామగ్రిని బీబీనగర్ మండలం జమీలపేట గ్రామంలోని వీఎన్డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో తయారు చేశారు. గురువారం రాకెట్ సామగ్రిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ పరిశోధన కేంద్రానికి తరలించారు.

Similar News

News December 6, 2025

NTR: పొందుగలలో బాలుడికి స్క్రబ్ టైఫస్ జ్వరం

image

మైలవరం మండలం పొందుగలకు చెందిన రాకేశ్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు అతడిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న బాలుడికి పరీక్షలు చేయగా, స్క్రబ్ టైఫస్ జ్వరమని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చంద్రాల పీహెచ్‌సీ డాక్టర్ ప్రియాంక తెలిపారు.

News December 6, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అత్యల్పంగా రాఘవపేటలో 11.7℃, మన్నెగూడెం, గోవిందారం 11.8, గుల్లకోట 11.9, కథలాపూర్ 12, ఐలాపూర్, నేరెళ్ల 12.1, మేడిపల్లి 12.2, మల్యాల, మద్దుట్ల, రాయికల్ 12.3, సారంగాపూర్, పేగడపల్లి, మల్లాపూర్, పోలాస, కొల్వాయి 12.4, జగ్గసాగర్ 12.5, తిరుమలాపూర్, పూడూర్ 12.6, గొల్లపల్లి, బుద్దేశ్‌పల్లి, అల్లీపూర్ 12.7, గోదూరులో 12.8℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.