News April 11, 2025

బీబీనగర్‌లో రాకెట్ సామాగ్రి తయారీ

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ త్వరలో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్‌లో వినియోగించనున్న ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫొమ్ ప్యాడ్లతో పాటు ఇతర ముడి సామగ్రిని బీబీనగర్ మండలం జమీలపేట గ్రామంలోని వీఎన్డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో తయారు చేశారు. గురువారం రాకెట్ సామగ్రిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ పరిశోధన కేంద్రానికి తరలించారు.

Similar News

News April 25, 2025

BREAKING: కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!

image

నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్‌ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.

News April 25, 2025

ఉద్రిక్తతల వేళ.. భారీ యుద్ధ విన్యాసం

image

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్టార్‌లో ‘ఆపరేషన్ ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్‌కు చెందిన అగ్రశేణి ఫైటర్ జెట్స్‌తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.

News April 25, 2025

పోలీసులకు సవాల్‌గా మారిన వీరయ్య హత్య కేసు?

image

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్‌పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!