News February 25, 2026
బీబీనగర్-నడికుడి రైల్వే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం

బీబీనగర్-నడికుడి రైల్వే రెండో లైన్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల భూముల వివరాలను సేకరించి, సరిహద్దులను పరిశీలించారు. రైల్వే లైన్ విస్తరణకు అవసరమైన భూసేకరణలో పారదర్శకత పాటిస్తామని ఆర్డీఓ వెల్లడించారు.
Similar News
News April 13, 2026
ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్కు రూ.800 చొప్పున చెల్లించాలి.
News April 13, 2026
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.
News April 13, 2026
బ్రహ్మ చేసిన పొరపాటు ఏంటి?

ఉదధిలోన నీళ్లు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ అందులోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి అతడిని పిసినారిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం.<<-se>>#PADHYAM<<>>


