News March 30, 2024

బీర్కూరులో బైక్ దొంగల అరెస్ట్.. 26 బైకుల స్వాధీనం

image

ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు బీర్కూర్ SI రాజశేఖర్ తెలిపారు. మండలంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమను చూసి భయపడి పారిపోతున్న ఇద్దరిని వెంబడించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిని బోధన్‌కి చెందిన అబ్దుల్ ఐయాజ్ ఖాన్(36), సమీర్ ఉద్దీన్(18)లుగా గుర్తించారు. అనంతరం విచారణ చేయగా వారు బైక్ దొంగలని తేలింది. దీంతో వారి వద్ద ఉన్న 26 బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Similar News

News October 5, 2024

NZB: ఆన్లైన్ బెట్టింగ్‌… ముగ్గురు ఆత్మహత్య!

image

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

News October 5, 2024

NZB: చిన్నారిపై దాడి చేసిన కుక్క

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాపులో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News October 4, 2024

ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్

image

ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.