News April 18, 2024

బీర్కూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కోటగిరి మండలం లింగాపూర్‌కి చెందిన నీరడి సాయిలు (45) అనే వ్యక్తి బీర్కూర్ అంగడిలో కూరగాయలు తీసుకుని బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు. బైరాపూర్ గేట్ వద్ద సాయిలు తన బైక్‌తో ముందున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో కిందపడ్డ సాయిలుకు తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిలు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Similar News

News October 13, 2024

కామారెడ్డి: తండ్రి మృతదేహం లభ్యం

image

తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News October 13, 2024

NZB: డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు

image

ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 8 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 6 గురు SGT, ఇద్దరు SA కొలువులు సాధించారు.ఉద్యోగాలు సాధించిన వారిలో గణపురం సుశీల(SGT), సదాలి నరేష్(SGT), గైని రాజు(SGT), అన్నాడి అజయ్ కుమార్(SGT), M.శ్రీశైలం(SGT), మొహ్మద్ ఖాజా(SGT), నంద అనిల్ (SA సోషల్), దేవసోత్ చందర్ రాథోడ్(SAసోషల్) ఉన్నారు.

News October 12, 2024

NZB: దసరా వేడుకల్లో దిల్ రాజు, సినీ హీరో ఆశిష్

image

NZB జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశిష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమి వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.