News April 12, 2024
బీర్కూర్ : సీడ్ సక్రమంగా లేకనే పంట రాలేదు :అవినాష్ రెడ్డి

బీర్కూర్ మండల కేంద్రంలో పంట నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించామని సీడ్ సక్రమంగా లేకనే రైతులకు పంట నష్టం జరిగిందని కిసాన్ కేత్ రాష్ర్ట అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బీర్కూర్లోని గ్రోమోర్కు చెందిన ఓ షాప్లో ఆర్కె సోనా విత్తనం రైతులకు అమ్మారని, ఈ సీడ్ సక్రమంగా లేక పంట రాలేదన్నారు.
Similar News
News March 28, 2025
NZB: కల్లులో గడ్డి మందు కలుపుకోని తాగాడు

నిజామాబాద్లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.
News March 28, 2025
NZB: స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా

స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. బీమా సౌకర్యం వివరాలను స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ తెలియజేయాలన్నారు.
News March 28, 2025
NZB: TGRJC CETకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలోని గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని TGRJC CET నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గంగా శంకర్ తెలిపారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మే 25న జిల్లా కేంద్రంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.