News February 7, 2025

బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం: మంత్రి కొండా

image

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా చేప‌ట్టిన బీసీ కుల‌గ‌ణ‌న స‌ర్వే చారిత్రాత్మకం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డ‌గా తాను ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండ్‌కు లేఖ‌లు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు పంపినట్లు తెలిపారు.

Similar News

News October 14, 2025

గట్టు: ఈరోజే చివరి రోజు.. దరఖాస్తు చేసుకోండి

image

గట్టు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ పోస్టుకు గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో బోధన చేయుటకు దరఖాస్తులను తీసుకుంటున్నామని పాఠశాల ఎస్ఓ గోపీలత తెలిపారు. బీఈడీలో ఇంగ్లిష్ చదివి ఉండాలని, టెట్ కూడా అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈ ఉపాధ్యాయ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశమని తెలిపారు. పూర్తి వివరాలకు కేజీబీవీ గట్టు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.

News October 14, 2025

విశాఖ: రైడెన్‌కు భారీగా రాయితీలు

image

➢విశాఖలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు ప్రభుత్వం 480 ఎకరాలను కేటాయింపు
➢ఈ భూములకు స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు
➢ప్లాంటు మినషనరీ ఖర్చులో 10% మూలధన రాయితీ
➢ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ ఛార్జీలు ప్రతి మూడేళ్లకు 5% చొప్పున పెంపు
➢డేటా సెంటర్ నిర్మాణం కోసం రూ.2,245 కోట్ల GSTకి మినహాయింపు
➢ఐదేళ్ల పాటు లీజులపై చెల్లించే GST మినహాయింపు
➢నీటి చార్జీపై పదేళ్లపాటు 25% రాయితీ

News October 14, 2025

ఏలూరు: హేలాపురి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినప్పుడే సదరు కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు గిరిజన భవన్‌లో సోమవారం హేలాపురి ఉత్సవాలు, గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్స్‌ను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సూపర్ జీఎస్టీ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు.