News November 20, 2024

బీసీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి బదిలీ

image

కర్నూలు జిల్లా బీసీ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మిని బదిలీ చేస్తూ  రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పోల భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో పలు శాఖలకు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న వెంకటలక్ష్మిని నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కారం చేయడంలో తమ వంతు కృషిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Similar News

News March 13, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 180 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 16,116 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 12, 2026

జగన్ విమర్శలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: ఆది కృష్ణమ్మ

image

కూటమి ప్రభుత్వంపై YCP అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లున్నాయనిని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.

News March 12, 2026

ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

image

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.