News July 22, 2024
బీ.ఎడ్. విద్యార్థులకు సూచన: పరీక్షల ఫీజు తేదీ ప్రకటన

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. నాల్గవ సెమిస్టరు, రెగ్యులర్ 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో 02-8-2024 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో పొందుపర్చినట్లు వివరించారు.
Similar News
News December 17, 2025
NZB: ఒక్క ఓటు తేడాతో గెలుపు

నందిపేట్ మండలం కంఠం సర్పంచ్గా సాయినాథ్ గెలుపొందారు. బుధవారం నందిపేట మండలంలో జీపీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి సాయినాథ్ 712 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇంద్రుడుకు 711 ఓట్లు వచ్చాయి. దీంతో సాయినాథ్ కేవలం ఒక్క ఓటుతో సర్పంచ్గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కంఠం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
News December 17, 2025
నిజామాబాద్ జిల్లా మూడో విడత తొలి ఫలితం

కమ్మర్పల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. రాజ రాజేశ్వరి నగర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తైద సుశీల-సాయన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 33 ఓట్లతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 17, 2025
NZB: ఒంటి గంట అప్డేట్ 74.36 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.


