News April 13, 2025

బుగ్గనకు వైఎస్ జగన్ కీలక పదవి!

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్‌కు ఆ కమిటీలో చోటు కల్పిస్తూ వైసీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్‌గా మొత్తం 33 మందితో ఈ కమిటీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. కమిటీలోని సభ్యులు జగన్‌కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు.

Similar News

News November 18, 2025

కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.

News November 18, 2025

కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.

News November 18, 2025

కామారెడ్డి: ‘గణిత అధ్యాపకుడి కోసం దరఖాస్తు చేసుకోండి’

image

బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపాదికన గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అధ్యాపకుడికి రూ.23,400 వేతనం ఇస్తామని, అభ్యర్థులు MSC MATH B.ED/M.ED చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.