News February 8, 2025
బుగ్గారం: ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738947343866_50789819-normal-WIFI.webp)
ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అక్కల సునీత, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
శ్రీకాకుళం: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ఎస్సీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738992922325_51456737-normal-WIFI.webp)
పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మండలంలోని కాజీపేట వద్ద జరిగిన కొట్లాట కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదైందన్నారు. కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు.
News February 8, 2025
అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోతున్నారు: అన్నా హజారే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995282894_782-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్పై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్తో కేజ్రీవాల్ అప్రతిష్ఠపాలయ్యారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని తెలిపారు. సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారేకు గతంలో కేజ్రీవాల్ శిష్యుడిగా ఉన్నారు.
News February 8, 2025
1200 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995458923_1199-normal-WIFI.webp)
న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ వైపు గాలి వీస్తోంది. ఒక్కో రౌండు లెక్కింపు ముగిసే కొద్దీ ఆమ్ఆద్మీ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. 9 రౌండ్లు ముగిసే సరికి అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ 1200 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీలో సీఎం ఆతిశీ మార్గేనా 3231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో బీజేపీ 45, ఆప్ 25 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.