News January 23, 2025
బుట్టాయిగూడెం ఘటనపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఎంపీడీవో

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామసభలో గురువారం జరిగిన ఘటనపై మండల ఎంపీడీవో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించిన కుమ్మరి నాగయ్య వ్యవసాయ భూమి ఉందని, భార్య శాంత అంగన్వాడి టీచర్గా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని నాగయ్యకు సూచించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం తన వెంట పురుగుమందు తెచ్చుకున్నారన్నారు.
Similar News
News October 26, 2025
కళ్యాణదుర్గం: సిబ్బంది నిర్లక్ష్యం.. శిశువు మృతి

కళ్యాణదుర్గంలోని RDT ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనేణేల్లు మండలం వీరాపురానికి చెందిన తులసి నెలలు నిండడంతో 2 రోజుల కిందట RDT ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆడపిల్లకు జన్మనివ్వగా, శిశువు మృతి చెందింది. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
News October 26, 2025
హనుమకొండ: రేపు మద్యం షాపులకు డ్రా

హనుమకొండ జిల్లాకు సంబంధించిన 2025-27 సంవత్సరానికి గానూ 67 మద్యం షాపుల నోటిఫికేషన్కు సంబంధించిన లాటరీ డ్రాను సోమవారం(రేపు) తీయనున్నట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంబేద్కర్ భవన్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రా తీయడం జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఎంట్రీ పాస్లతో హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.
News October 26, 2025
‘మొంథా’ తుఫాన్.. జిల్లాలో కంట్రోల్ విభాగాల ఏర్పాటు

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. తుఫాన్ సంబంధిత సమాచారం లేదా సహాయక చర్యల కోసం ప్రజలు ఈ కింది నంబర్లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం 08672-252572, MTM RDO 08672-252486, గుడివాడ 08674-243693, ఉయ్యూరు 08676-232589, ఈ కంట్రోల్ రూములు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ చెప్పారు.


