News July 3, 2024

బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

పలాస మీదుగా సత్రాగచ్చి(SRC), SMVT బెంగళూరు(SMVB) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొద్దిరోజులు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.08845 SRC- SMVB ట్రైన్‌ను జులై 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం, నం.08846 SMVB- SRC ట్రైన్‌ను జులై 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయనగరం,విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News January 5, 2026

టెక్కలి: 10 సార్లు సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి మృతి

image

టెక్కలి మండలం పెద్దసానకు చెందిన కోట చిన్నబాబు (103) సోమవారం మృతిచెందారు. గ్రామానికి చెందిన చిన్నబాబు సుమారు 50 ఏళ్లు (10 సార్లు) గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అంతే కాకుండా ఒక విద్యా సంస్థల ఛైర్మన్‌గా.. రైతు సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖులు నివాళులు అర్పించారు.

News January 5, 2026

శ్రీకాకుళం: యాక్టివ్ మోడ్‌లోకి ఆ సీనియర్ నేత..పొలిటికల్ గేమ్‌కేనా!

image

2024 ఎన్నికలనంతరం రెండేళ్లుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కూటమిని విమర్శించ లేదు. అయితే ఇటీవల పలు సమావేశాల్లో పక్కా లెక్కలతో మాట్లాడి యాక్టివ్ మోడ్‌లోకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ధర్మాన ప్రసాద్‌కు ఉంది. ఈ సీనియర్‌తోనే వైసీపీ అధినేత జగన్‌ తాడేపల్లి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహం రచిస్తారని అంతర్గత చర్చ సాగుతోంది.

News January 5, 2026

SKLM: పది పాసైతే చాలు 350 ఉద్యోగాలు

image

ఈనెల 7న కొత్తూరులోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్ ఆదివారం తెలిపారు. 10 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు 350 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.