News February 26, 2026

బెజవాడ రైల్వేస్టేషన్‌కు రూ.600 కోట్లు..!

image

విజయవాడ నగరంలో PPP మోడల్ కింద పలు భారీ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. సుమారు రూ.660 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణకు టెండర్లు పిలుస్తున్నారు. విద్యాధరపురం డిపో నుంచి 100 విద్యుత్ బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని 19 ప్రధాన రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. రూ.600 కోట్లతో స్ట్రామ్ డ్రెయిన్ల నిర్మాణాన్ని కూడా ఇదే విధానంలో చేపట్టే అవకాశం ఉంది.

Similar News

News April 18, 2026

గుంటూరులో NHM పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి!

image

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో 7 ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు www.guntur.nic.in లో దరఖాస్తులు పొందవచ్చని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.800, ఇతరులు రూ.500 ఫీజు బ్యాంకులో చెల్లించాలి. నింపిన దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 30 లోగా నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలి.

News April 18, 2026

ప్రకృతి నడుమ ఆధ్యాత్మికతకు ప్రతీక ఏడుపాయల ఆలయం

image

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఏడూ వాగులు సంగమించే ప్రదేశంలో వెలసిన వన దుర్గాభవాని అమ్మవారిని దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు స్వయంభువుగా వెలసి భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం. మహాశివరాత్రి, జాతర సమయంలో ఆలయం సందడిగా మారుతుంది. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.

News April 18, 2026

జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

image

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.