News April 1, 2025

బెజ్జంకి: ‘భూములు మాకే ఇవ్వాలి’

image

తోటపల్లి రిజర్వాయర్ కోసం తమ వద్ద సేకరించిన భూములను తమకే ఇవ్వాలని గాగిల్లాపూర్, తోటపల్లి గ్రామాల్లోని రైతులు తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు. బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల కేటాయించగా కళాశాలకు భూమి కోసం సోమవారం ఉదయం తహశీల్దార్‌తో పాటు, సర్వే అధికారులు సర్వే చేశారు. హద్దులు పెడుతున్న విషయం తెలుసుకున్న రైతులు తమ భూములు తమకే ఇవ్వాలని వేడుకున్నారు.

Similar News

News November 16, 2025

జగదాంబ జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.

News November 16, 2025

నల్గొండ జిల్లాలో చలి పులి పంజా

image

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 – 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు జిల్లాలో శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి, పగలు శీతల గాలులు వీస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.

News November 16, 2025

విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

image

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్‌లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.