News April 1, 2025

బెజ్జంకి: ‘భూములు మాకే ఇవ్వాలి’

image

తోటపల్లి రిజర్వాయర్ కోసం తమ వద్ద సేకరించిన భూములను తమకే ఇవ్వాలని గాగిల్లాపూర్, తోటపల్లి గ్రామాల్లోని రైతులు తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు. బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల కేటాయించగా కళాశాలకు భూమి కోసం సోమవారం ఉదయం తహశీల్దార్‌తో పాటు, సర్వే అధికారులు సర్వే చేశారు. హద్దులు పెడుతున్న విషయం తెలుసుకున్న రైతులు తమ భూములు తమకే ఇవ్వాలని వేడుకున్నారు.

Similar News

News November 19, 2025

మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

image

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.

News November 19, 2025

ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

image

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్‌ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.

News November 19, 2025

తోట్లవల్లూరు: మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

image

తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన మహిళ కూలి పనికి వెళ్లి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్ కాసింబి(40) మినుములు నూర్చడానికి గుంటూరు (D) కొల్లిపర (M) వల్లభారానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు ఎస్సై పి. కోటేశ్వరరావు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.