News January 26, 2025
బెజ్జూర్: పురుగుమందు తాగి మృతి

బెజ్జూర్ మండలం కుంటలమానపల్లికి చెందిన బోర్కుట్ ఎమ్మాజీ (48) శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఎమ్మాజీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు భార్య రుక్మాబాయి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
కామారెడ్డి: DCC అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నారెడ్డి మోహన్ రెడ్డి

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రామారెడ్డి జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారెడ్డి మోహన్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్కు దరఖాస్తును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆపత్కాలంలో పార్టీకి ఎనలేని సేవలు చేశానని, తన సేవలను గుర్తించి డీసీసీ పదవి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 15, 2025
మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
News October 15, 2025
సికింద్రాబాద్లో టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్

సికింద్రాబాద్లోని AOC సెంటర్లోని థాపర్ స్టేడియంలో NOV 15 నుంచి DEC 1వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్( టెరిటోరియల్ ఆర్మీ), 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్, 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్లో సైనికుల కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. టెన్త్ పాసై శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://www.ncs.gov.in/ను సంప్రదించవచ్చు.