News October 7, 2024

బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

Similar News

News October 7, 2024

భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ

image

భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

News October 7, 2024

యోగా ఛాంపియన్షిప్‌లో జాతీయస్థాయికి బాసర విద్యార్థులు

image

TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.

News October 7, 2024

నిర్మల్: రూ.7,33,999తో అమ్మవారి అలంకరణ

image

నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువు దీరిన దుర్గా మాత మండపం వద్ద ఆదివారం రాత్రి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 ఇతర నోట్లతో మొత్తం రూ .7,66,999తో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు..