News January 30, 2025
బెజ్జూర్: హాస్టల్లో మృతిచెందిన విద్యార్థి కుటుంబీకులకు ఉద్యోగం

ఇటీవల ఆసిఫాబాద్ బీసీ హాస్టల్లో అనారోగ్యంతో మండలంలోని అందుగులగూడకు చెందిన వెంకటలక్ష్మి అనే విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై బీఆర్ఎస్ నాయకులు RS ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటంతో కుంటలమానేపల్లి ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ఆమె సోదరుడు ధర్మయ్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినట్లు నియోజకవర్గ కన్వీనర్ రాంప్రసాద్ తెలిపారు. కుటుంబానికి ఉద్యోగం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News January 5, 2026
ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 5, 2026
హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడేది తెలుగే: చంద్రబాబు

AP: హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు అని CM చంద్రబాబు అన్నారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగు జాతి నం.1గా ఉండాలి. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంగ్లిష్ అవసరమే కానీ మాతృభాషను మరిస్తే మనల్ని మనమే మరిచినట్టు అవుతుంది. టెక్నాలజీతో తెలుగు కనుమరుగవుతుందనే భయం వద్దు. టెక్నాలజీతో తెలుగును కాపాడుకోవడం సులభం’ అని పేర్కొన్నారు.
News January 5, 2026
GWL: పదోన్నతి బాధ్యతను పెంచుతుంది- ఎస్పీ

పదోన్నతి గౌరవంతో పాటు బాధ్యతను మరింత పెంచుతుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆయన రాచకొండ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పని చేసిన ఆయన ఇటీవల పదోన్నతి పొంది గద్వాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు.


