News January 30, 2025
బెజ్జూర్: హాస్టల్లో మృతిచెందిన విద్యార్థి కుటుంబీకులకు ఉద్యోగం

ఇటీవల ఆసిఫాబాద్ బీసీ హాస్టల్లో అనారోగ్యంతో మండలంలోని అందుగులగూడకు చెందిన వెంకటలక్ష్మి అనే విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై బీఆర్ఎస్ నాయకులు RS ప్రవీణ్ కుమార్ చేసిన పోరాటంతో కుంటలమానేపల్లి ప్రభుత్వ గిరిజన పాఠశాలలో ఆమె సోదరుడు ధర్మయ్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినట్లు నియోజకవర్గ కన్వీనర్ రాంప్రసాద్ తెలిపారు. కుటుంబానికి ఉద్యోగం కల్పించిన అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News February 13, 2025
పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.
News February 13, 2025
వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.
News February 13, 2025
LBనగర్: ఆస్పత్రిలో మైనర్ బాలుడు మృతి.. ఆందోళన

మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడు మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.