News April 8, 2025

బెటాలియన్‌కు ఎంపీ నిధులు రూ.20 లక్షలు మంజూరు

image

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో గల 6వ బెటాలియన్‌లో పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను మంగళవారం సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

Similar News

News November 28, 2025

సాలూరు: వేధిస్తున్నాడంటూ వ్యక్తిపై మహిళ ఫిర్యాదు

image

సాలూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కారుణ్య నియామకం కోసం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ఓ మంత్రి వద్ద అనధికారిక పీఏగా విధులు నిర్వహిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైందని వైసీపీ Xలో ఆరోపించింది.

News November 28, 2025

పల్నాడు: వెంటపడొద్దు అన్నందుకు చంపేశారు..!

image

బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రేమిడిచర్లలో శామ్యేల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యువతి తన తండ్రికి చెప్పడంతో ఆయన సదరు యువకుడిని తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి తండ్రిని రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI షమీర్ బాషా తెలిపారు.

News November 28, 2025

జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

image

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.