News March 22, 2025
బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News April 24, 2025
జగిత్యాల: సమస్యకు పరిష్కారం ఆలోచించాలి: ఎస్పీ

సమస్యకు పరిష్కారం ఆలోచించాలి తప్పా, మానసిక వేదనకు గురి కాకూడదని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి గురువారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, అధికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య ఉంటే ఆయన తెలియజేయాలన్నారు. వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో పోలీస్ శాఖ ఒకటన్నారు.
News April 24, 2025
జగిత్యాల: రేపు పోషణ మాసం ముగింపు ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలో పోషణ మాస ముగింపు ఉత్సవాలను శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. కలెక్టరేట్లో ఉ.11గం.లకు పోషణ మాసం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారని, కావున మహిళలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News April 24, 2025
ఎన్కౌంటర్పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్కౌంటర్పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.