News January 27, 2025
బెల్లంకొండ: చేతబడి కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు

బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలో సుమారు 12 గృహాల ముందు ముగ్గు, నిమ్మకాయలు, ఎరుపు రంగు వస్త్రం, ఎండు మిరపకాయలతో కొన్ని వస్తువులను ఆదివారం రాత్రి సమయంలో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం గ్రామస్థులు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో చేతబడి నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఇళ్లను వదిలి ప్రజలు బయటికి రావటం లేదు.
Similar News
News November 7, 2025
ADB: ఉద్యోగం పేరిట రూ.6.08లక్షలు కాజేశారు

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ యువకుడు మోసపోయిన ఘటన ఆదిలాబాద్లో జరిగింది. ఖుర్శిద్ నగర్కు చెందిన ఓ యువకుడికి ఇన్స్టాలో జాబ్ యాడ్ వచ్చింది. అది చూసి సదరు కంపెనీని సంప్రదించాడు. టాస్క్లు పూర్తి చేస్తే అకౌంట్లో నగదు జమ అవుతుందని నమ్మించి విడతల వారీగా రూ.6.08 లక్షలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
News November 7, 2025
జర్మనీలో ఉద్యోగ అవకాశాలు: జితేంద్రబాబు

జర్మనీ నిర్మాణ రంగంలో రెండేళ్ల కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్రబాబు గురువారం తెలిపారు. ఐటీఐ, డిప్లమా అర్హతతో పాటు ఎలక్ట్రీషియన్ వర్క్లో రెండేళ్ల అనుభవం ఉన్న 18-30 ఏళ్ల పురుషులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration?page=program-registration వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయాలన్నారు.
News November 7, 2025
అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు

AP: శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు అలర్ట్. వారికి టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం రోజూ 750 టికెట్లను ఆన్లైన్ డిప్ విధానంలో జారీ చేస్తుండగా, ఈ విధానాన్ని రద్దు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో టికెట్లు కేటాయించనుంది. ఇకపై 3 నెలల ముందుగానే ఆన్లైన్లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది.


