News April 9, 2025

బెల్లంకొండ: విద్యుత్ షాక్‌తో జేఎల్‌ఎం మృతి

image

బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. కరెంట్ స్తంభం ఎక్కుతుండగా మాచయపాలెం జేఎల్ఎంగా పనిచేస్తున్న నరసింహారెడ్డి (35) విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడు పాపాయపాలెంకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 18, 2025

కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

image

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

image

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

image

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.