News February 19, 2025

బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి విద్యాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

Similar News

News February 25, 2026

NGKL: ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్ ALL THE BEST

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్క ఎగ్జామ్‌ రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

News February 25, 2026

నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.

News February 25, 2026

నేడు KTR రాక.. నాగర్‌కర్నూల్‌లో హైటెన్షన్

image

కుమ్మెర కులోన్మాద ఘటనలో 8 మంది నిందితుల్లో ముగ్గురినే అరెస్ట్ చేశారని, మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మ.12 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నాగర్‌కర్నూల్‌కు రానున్నారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.