News February 19, 2025

బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి విద్యాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

Similar News

News April 11, 2026

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు రానున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News April 11, 2026

ములుగు: ‘మన ఇసుక వాహనం’తో అక్రమ రవాణాకు చెక్!

image

జిల్లాలో ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం’తో అక్రమ ఇసుక రవాణాకు చెక్ పడనుంది. కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపు చేసి పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రత్యేక చొరవతో ‘ఇసుక వాహనం’ అమల్లోకి తెచ్చారు. మీ సేవలో అవసరమున్న వ్యక్తులు స్లాట్ బుక్ చేసుకొని ఇసుక పొందాల్సి ఉంటుంది. ప్రతి వినియోగదారుడి వివరాలు స్థానిక కార్యదర్శి పరిశీలించి సప్లై చేస్తారు.

News April 11, 2026

GNT: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్

image

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.