News February 19, 2025

బెల్లంపల్లిలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి విద్యాభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఆయన గుర్తుచేశారు.

Similar News

News March 22, 2025

నేడు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

image

తమిళనాడులో అధికార డీఎంకే అధ్యక్షతన డీలిమిటేషన్‌పై నేడు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే CM రేవంత్, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెన్నై చేరుకున్నారు. వారికి అక్కడి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం నేతలందరూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

News March 22, 2025

మహాదేవపూర్: అకాల వర్షం.. అపార నష్టం

image

మహాదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి గాలులతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. తడిసిన పంటను చూసి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని, నష్టపోయిన తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.

News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్‌(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

error: Content is protected !!