News February 8, 2025

బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి 

image

బెల్లంపల్లిలోని ఓ బార్‌లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్‌లోని బార్‌లో మద్యం తాగుతున్నారు. అదే బార్‌లో మద్యం తాగుతున్న తాండూర్‌కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.

Similar News

News November 13, 2025

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

image

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.

News November 13, 2025

పెదపాలపర్రులో వ్యక్తి అస్థిపంజరం లభ్యం

image

ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో పాడుబడిన పెంకుటింట్లో బుధవారం కుళ్లిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. పిల్లులు పట్టుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరభద్రరావు వివరాలు సేకరించారు. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన రైతు సంకురాత్రి తులసీ మాధవరావు (59)గా బంధువులు ఈ అస్థిపంజరాన్ని గుర్తించారు. కేసు నమోదు చేశారు.

News November 13, 2025

బాపట్ల: న్యుమోనియా గురించి అవగాహన కల్పించాలి

image

ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా సోషల్ అవేర్‌నెస్ అండ్ యాక్షన్ ఆన్ న్యుమోనియా కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. న్యుమోనియా నియంత్రణకు టీకాలు, శుభ్రత, సమయానుకూల వైద్యం అవసరమని పేర్కొన్నారు. డిఎంహెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ, వైద్య అధికారులు పాల్గొన్నారు.