News February 8, 2025
బెల్లంపల్లిలో బీర్ సీసాలతో దాడి

బెల్లంపల్లిలోని ఓ బార్లో బీర్ సీసాలతో దాడి చేసుకోవడం భయాందోళన సృష్టించింది. 2 టౌన్ SI మహేందర్ వివరాల ప్రకారం.. స్థానిక గొల్లగూడెంకు చెందిన సాగర్ స్నేహితులతో కలిసి కాల్ టెక్స్లోని బార్లో మద్యం తాగుతున్నారు. అదే బార్లో మద్యం తాగుతున్న తాండూర్కు చెందిన వంశీ మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. సాగర్, అతని స్నేహితులు బీర్ సీసా పగలగొట్టి వంశీపై దాడి చేశారు. గొడవపై కేస్ నమోదైంది.
Similar News
News November 15, 2025
నెల్లూరు జిల్లాలోని అనధికార కట్టడాలకు భలే ఛాన్స్..

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్ లేకుండా, ప్లాన్ ఉన్నా అనుమతికి మించి కట్టిన భవనాలకు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన BPS అవకాశం ఓ వరం అవుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 31 లోపు నిర్మించిన అలాంటి భవనాలను క్రమబద్ధీకరించడానికి ఇదో చక్కని అవకాశం. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు కందుకూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలలో అలాంటి భవనాలు భారీగా ఉన్నాయని అంచనా. 2019 తరువాత ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశం కల్పించింది.
News November 15, 2025
రేడియో కాలర్ టెక్నాలజీతో ఏనుగుల దాడులకు చెక్.?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల <<18272761 >>దాడుల<<>> అడ్డుకట్టకు అధికారులు రేడియో కాలర్ టెక్నాలజీని వాడనున్నారు. అందులో అమర్చే GPS టెక్నాలజీ ద్వారా ఏనుగుల కదలికలను రియల్ టైమ్లో గుర్తించే వీలు ఉంటుంది. గుంపులోని ఒక ఏనుగకు ఈ రేడియె కాలర్ను ఏర్పాటు చేయడం ద్వారా అవి గ్రామాల వైపు మళ్లినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. దీని ద్వారా మనుషుల, ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించే అవకాశం ఉందని ఇటీవల Dy.CM పవన్ సూచించారు.
News November 15, 2025
సూర్యాపేటలో ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

దురాజ్పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివ్వెంల పోలీసులు, రహదారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.


