News April 6, 2025

బెల్లంపల్లిలో 9మంది జూదరులు అరెస్టు

image

పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు 1టౌన్ SHOదేవయ్య తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్‌లో వెంకటేశ్‌కు చెందిన ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. వెంకటేశ్, క్రాంతి కుమార్, రమేశ్, సురేశ్, మహేశ్, సుమన్, స్వామి, శ్రీనివాస్, మల్లాద్రిను అరెస్టు చేసి వారి వద్ద రూ.12,500, 7ఫోన్లు, 5బైక్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు SHO వెల్లడించారు.

Similar News

News November 18, 2025

నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.

News November 18, 2025

నేడు పుట్టపర్తికి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు పుట్టపర్తికి రానున్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు సా.6 గంటలకు వారు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తికి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ రానుడంటంతో ఏర్పాట్లను పరిశీలించి రాత్రికి ఇక్కడే బస చేస్తారు. బుధవారం హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొంటారు.

News November 18, 2025

పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

image

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.