News February 1, 2025

బెల్లంపల్లి: అడవి పందిని హతమార్చిన పెద్దపులి

image

2 రోజులుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గ దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం మండల ప్రజలను హడలెత్తిస్తోంది. బుగ్గకు వెళ్లే రహదారి పక్కన తోకల మల్లేశ్‌కు చెందిన పత్తి చేనులో అడవి పందిపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పెద్దపులి దాడి విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.

Similar News

News February 26, 2026

కర్నూలు జిల్లాలో 293 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మంది విద్యార్థులకు గానూ 21,135 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షల పట్ల సందేహాలు ఉంటే ఆర్ఐవో కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 26, 2026

రాష్ట్రానికి రూ.2,160 కోట్లు?

image

TG: PMAY-అర్బన్ స్కీమ్ కింద రాష్ట్రానికి 1.3 లక్షల యూనిట్లు మంజూరవడంతో ₹1,695 కోట్లు అందనున్నాయి. అలాగే PMAY-గ్రామీణ్ పథకం కింద 3 లక్షల యూనిట్లు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే మరో ₹2,160 కోట్లు అందనున్నాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బూస్ట్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

News February 26, 2026

జగిత్యాల: ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

image

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ జి.నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి 1న ఉదయం 10 నుంచి 1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు.