News February 5, 2025
బెల్లంపల్లి: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ రైల్వే లైనులో మధ్యలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. వివరాల ప్రకారం..బుధవారం ఉదయం రైల్వే లైన్ల మధ్యలో మృతదేహం ఉన్నట్లు రైల్వే డ్రైవర్ సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షించారు. యువకుడు చంద్రవెల్లి గ్రామానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ నరేష్(24)గా గుర్తించారు.
Similar News
News January 10, 2026
సూర్యాపేట: రైతు ఇంట్లో ప్రేమ పక్షుల ముచ్చట!

మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగవుతున్న తరుణంలో.. పక్షుల మధ్య అపారమైన అనురాగం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా ముక్కుడుదేవులపల్లిలో రైతు మల్లేష్ ఇంట్లోని చెట్టుపై శనివారం సాయంత్రం పక్షులు ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న అరుదైన దృశ్యం కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి గ్రామస్థులు మంత్రముగ్ధులయ్యారు. ప్రకృతిలోని ఈ అందమైన అనుబంధాన్ని పలువురు తమ చరవాణిల్లో ఆసక్తిగా చిత్రీకరించారు.
News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News January 10, 2026
VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.


