News February 5, 2025

బెల్లంపల్లి: అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ రైల్వే లైనులో మధ్యలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. వివరాల ప్రకారం..బుధవారం ఉదయం రైల్వే లైన్ల మధ్యలో మృతదేహం ఉన్నట్లు రైల్వే డ్రైవర్ సమాచారమిచ్చారు. కానిస్టేబుల్ ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షించారు. యువకుడు చంద్రవెల్లి గ్రామానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ నరేష్(24)గా గుర్తించారు.

Similar News

News April 17, 2026

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News April 17, 2026

ఢిల్లీ హైకోర్టుకు అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ తదితర నటులు సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News April 17, 2026

ఆరోపణలకు ఎవరు సమాధానం చెప్పాలి..!

image

సత్యవేడు నియోజకవర్గం నుంచి TNకు ప్రతిరోజు 50 నుంచి 60 ఇసుక ట్రాక్టర్లు తరలిపోతున్నాయని MLA ఆదిమూలం కుమారుడు ఆరోపించారు. మరి ఎక్కడ నుంచి పోతున్నాయి? ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి? అధికారులు ఏమి చేస్తున్నారు? చెక్ పోస్టుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన చేసిన ఆరోపణలు నిజమని క్షేత్రస్థాయిలో సమాధానం రాగా.. అధికారులు, టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలనే చర్చ నడుస్తుంది.