News February 5, 2025

బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పులి సంచారం

image

వారం రోజులుగా పెద్దపులి సంచారం 2 మండలాల అటవీ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధి బుగ్గగూడెం అటవీ ప్రాంతం, కాసిపేట దుబ్బగూడెం, పెద్దనపల్లి ఏరియాల్లో సంచరిస్తోంది. బుధవారం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారి పూర్ణచందర్ తెలిపారు.

Similar News

News February 5, 2025

తొర్రూరు: వైద్యం వికటించి యువకుడు మృతి

image

తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

నిర్మల్: అధికారులకు కలెక్టర్ సూచనలు

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, నర్సాపూర్ (జి) ఆసుపత్రుల్లో ఇప్పటివరకు జరిగిన సిజేరియన్, సాధారణ ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితంగా ప్రసవాలు జరుగుతాయని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News February 5, 2025

జనగామ: స్త్రీనిధి రుణాల రికవరీ శాతాన్ని పెంచాలి: కలెక్టర్

image

కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీఓఏలు, డీపీఎంలతో రుణాల రికవరీ, జిల్లాకు కేటాయించిన సమాచార సంక్షిప్త పరికరాలపై(E-pass machines) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10న రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాకు రానున్న నేపథ్యంలో స్త్రీనిధి రుణాల రికవరీ పట్ల శ్రద్ధ వహించాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సూచించారు.

error: Content is protected !!