News March 10, 2025

బెల్లంపల్లి: ‘చిన్నారుల చికిత్సకు రూ.32కోట్లు కావాలి’

image

తమ పిల్లలను కాపాడాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బెల్లంపల్లికి చెందిన కృష్ణవేణి-కళ్యాణ్ దాస్ దంపతుల కుమార్తె సహస్ర(1), కుమారుడు మహావీర్(4)లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫి (SMA) వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో వారికి ఒక్కొక్కరికి రూ.16కోట్ల ఇంజెక్షన్ వేయాలని డాక్టర్లు తెలిపారు. చికిత్స చేయించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని.. ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News March 11, 2025

విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్‌ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.

News March 11, 2025

కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

News March 11, 2025

పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే..

image

* సాయంత్రం వేళల్లో కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు.
* రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలా మీ బ్రెయిన్, బాడీని సిద్ధం చేసుకోవాలి.
* నిద్రకు ముందు రిలాక్స్ అవ్వండి. వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి.
* నైట్ అతిగా తినొద్దు. ఆయాసం వల్ల నిద్ర త్వరగా పట్టదు.

error: Content is protected !!