News April 11, 2025
బెల్లంపల్లి: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతి

బెల్లంపల్లిలోని ఆకినేపల్లి శివారులో చింతచెట్టుకు 5రోజుల క్రితం ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాళ్లగురజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాస్కు గ్రామ శివారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి చెందిన చేను వద్ద దుర్వాసన రావడంతో గమనించాడు. చెట్టు కొమ్మల మధ్య ఓ వ్యక్తి ఉరేసుకొని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.
News November 18, 2025
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.
News November 18, 2025
960 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TG: వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టుల్లో 960 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో 23 అదనపు కోర్టు మేనేజర్ పోస్టులు, మరిపెడలో 27, హన్మకొండ, హుజూర్ నగర్, సుల్తానాబాద్, దేవరకద్ర, భీమగల్, సంగారెడ్డి, భూపాలపల్లిలో 196, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 617, 5 ఫస్ట్ క్లాస్ కోర్టుల్లో 97 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.


