News February 8, 2025
బెల్లంపల్లి: చోరీకి పాల్పడిన అనుమానితుని ఫోటో విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738935113608_51297756-normal-WIFI.webp)
బెల్లంపల్లి పట్టణంలో బ్యాంకు డబ్బులు విత్ డ్రా చేసుకొని వెళుతున్న బట్వాన్పల్లి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి నుంచి నగదు చోరీ చేసిన నిందితుల అనుమానిత ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వన్ టౌన్ SHO దేవయ్య మాట్లాడుతూ.. చోరీ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ఏలూరు జిల్లాలో టెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738992092827_1221-normal-WIFI.webp)
ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
News February 8, 2025
జనగామ: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738990712921_51263166-normal-WIFI.webp)
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో జనగామ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
News February 8, 2025
BREAKING: నిజామాబాద్: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738992011164_718-normal-WIFI.webp)
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.