News January 27, 2025

బెల్లంపల్లి: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

image

నీటి సంపులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. CI మహేందర్ కథనం ప్రకారం.. గీసుకొండ(M) శాయంపేటకు చెందిన శుభశ్రీకి బెల్లంపల్లికి చెందిన ప్రదీప్ కుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా గతేడాది ప్రదీప్ మృతిచెందడంతో శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. ఆదివారం ఆమె స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమారుడు నీటి సంపులో పడి మృతి చెంది ఉన్నాడు.

Similar News

News November 17, 2025

కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

image

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

News November 17, 2025

కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

image

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

News November 17, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.