News February 14, 2025
బెల్లంపల్లి: బార్లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.
Similar News
News November 6, 2025
వికారాబాద్లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
News November 6, 2025
వికారాబాద్: రాజీమార్గం అన్ని విధాలుగా మేలు: జడ్జి

రాజీమార్గంతో లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో నవంబర్ 15న నిర్వహించనున్న లోక్ అదాలత్పై పోలీసులు, న్యాయవాదులతో జడ్జి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులకు నచ్చజెప్పి భారీగా లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
News November 6, 2025
గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.


