News February 14, 2025

బెల్లంపల్లి: బార్‌లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

image

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్‌లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్‌ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.

Similar News

News October 18, 2025

ములుగు: ప్లాస్టిక్ కవర్‌లో మహిళ మృతదేహం

image

ములుగు మండలం తునికిబొల్లారం అయ్యప్ప చెరువులో ఓ ప్లాస్టిక్ కవర్‌లో మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యం అయింది. వర్గల్ మండలం మీనాజీపేట్‌కి చెందిన మంకని బాలమణిగా(50) పోలీసులు గుర్తించారు. ఆమె ఈ నెల 10న కనిపించకుండా పోవడంతో ఆమె భర్త బాలనర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

News October 18, 2025

బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

image

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.

News October 18, 2025

NZB: కానిస్టేబుల్ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్

image

నిజామాబాద్ CCS కానిస్టేబుల్ ఇ. ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితుడు షేక్ రియాద్‌ను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి పంపించి పర్యవేక్షణకు ఆదేశించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి, సహాయం అందించాలని సూచించారు. దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.