News February 14, 2025

బెల్లంపల్లి: బార్‌లో దాడి.. ఆరుగురికి రిమాండ్: CI

image

బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఓ బార్‌లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌషీల్, కాలం నవీన్, చింతం సాయికుమార్‌ను గురువారం రిమాండ్ తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీని 6గురు వ్యక్తులు బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లి సాగర్, రత్నం సోము, మామిడి అన్నమయ్యలను ఈనెల 9న అరెస్టు చేశారు.

Similar News

News November 18, 2025

అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

image

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

image

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

News November 18, 2025

అల్లూరి: ‘చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి’

image

రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందన్నారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.