News February 1, 2025
బెల్లంపల్లి: బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లికి వచ్చిన పెద్దపులి

బెల్లంపల్లి పట్టణం స్టేషన్ ఏరియా పెద్దనపల్లి పెద్దమ్మతల్లి గుడి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం పెద్దపులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖాధికారి పూర్ణచందర్, కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఏరియాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుగ్గగూడెం నుంచి పెద్దనపల్లి ఏరియాలో సంచరిస్తుందన్నారు.
Similar News
News September 19, 2025
MDK: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత-చేవెళ్లకు రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.35వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు.
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
News September 19, 2025
దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.