News February 5, 2025

బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం

image

బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.

Similar News

News October 16, 2025

RR: మద్యం దుకాణాలకు టెండర్లు పోటీ

image

సరూర్‌నగర్ ఎక్సైస్ జిల్లాలో 138 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటివరకు 1300కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్‌నగర్‌లో 32కి 500, హయత్‌నగర్ 28కి 510, ఇబ్రహీంపట్నంలో 19కి 100, మహేశ్వరంలో 14కి 150, అమన్‌గల్ 17కి 50, షాద్‌నగర్ 28కి 100 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మరో 2 రోజుల సమయం ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

News October 16, 2025

లోకేశ్ కౌంటర్ కర్ణాటక ఐటీ మంత్రికేనా?

image

గూగుల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.22వేల కోట్ల రాయితీలు ఇస్తోందని, అందుకే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్న వ్యాఖ్యానించారు. అలాంటి రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని పలువురు విమర్శిస్తారని చెప్పారు. ఈ కామెంట్లకే ఏపీ మంత్రి లోకేశ్ <<18020050>>కౌంటర్<<>> ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా పెట్టుబడులు సెగ పొరుగువారికి తగులుతోందని ట్వీట్ చేశారు.

News October 16, 2025

గాంధారి శివారులో వ్యక్తి హత్య?

image

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో దారుణం జరిగింది. గాంధారి నుంచి చద్మల్ దారిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవం పాక్షికంగా కాలిపోయింది. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తిని గుర్తిస్తే గాంధారి ఎస్ఐకి తెలపాలన్నారు.